Pages

Sunday, November 7, 2010

తప్పిన ‘జల్‌’‌ గండం అయినా అతలాకుతలం

Chennai-4
జల్‌ తుపాన్‌ తాకిడికి కోస్తా, రాయ లసీమ జిల్లాలు అతలాకుతలం అయ్యాయి. ఈశాన్య రుతుప వనాల ప్రభావంతో దెబ్బతిన్న ప్రాంతాల్లోనే తిరిగి జల్‌ తుపాను తీవ్ర ప్రభావం చూపిస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ ‘జల్‌’ తుపాను సాధారణ తుపానుగా బలహీనపడినప్ప టిీ నెల్లూరు జిల్లాలో ప్రజలు ఇంకా భయం గుప్పిట్లోనే ఉండటం తో. ప్రభుత్వం వారిని సహాయకశిబిరాలకు తరలిస్తుంది.ఈ తుపాన్‌ కారణంగా ఒక్క నెల్లూరు జిల్లాలోనే 15మంది మృత్యువాతపడ్డారు. ఇప్పటివరకు సుమారు 10,500 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినటుల జిల్లా యం త్రాంగం వెల్లడించారు.జిల్లా వ్యాప్తంగా చెరువుల అన్నీ నిండి పోయి ప్రమాదపుటంచుల్లో ఉన్నాయి.జల్‌ ప్రభావంతో నెల్లూ రు-గూడూరుల మధ్య రైళ్ల వేగాన్ని 50కి.మీలకు నియం త్రించినట్లు అధికారులుతెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలో ఆదివారం ఉదయం నుంచి అనేక ప్రాంతాల్లో ఈదురు గాలులతో పాటు ఓ మోస్తరు నుంచి భారీగానే వర్షాలు నమోదయ్యాయి. మధ్య మధ్యలో వర్షం తెరపినప్పటికీ తిరిగి జల్లులతో కూడిన వర్షాలు పడ్డాయి. కృష్ణాజిల్లా తీర ప్రాంత గ్రామాల్లో ఈ వర్షాలు అలజడి సృష్టించాయి. ఆటుపోట్లు అధికంగా ఉండటంతో పాటు భారీ వర్షాల కారణంగా సముద్రంలో కలిసే డ్రైన్లలోని నీరు ఎదురు తన్నటంతో తీర ప్రాంత గ్రామాల్లో సముద్రపు నీరు గ్రామాన్ని తాకింది.

చిత్తూరులో సముద్ర తీరానికి సమీపంలో వున్న నిరుపేదలు నిర్మించుకున్న పూరిగుడిసెలు తుపాను గాలికి ఎగిరిపోయా యి. అలల ఉధృతి కారణంగా శ్రీకాకుళం జిల్లాలోని బారువ- కొత్తూరు తీర ప్రాంతంలో పది అడుగుల మేర సముద్రం ముందుకు వచ్చింది. అయితే ఈ జిల్లాల్లోని లోత ట్టు ప్రాం తాల ప్రజలను ముందుస్తు చర్యల్లో భాగంగా సురక్షిత ప్రాంతా లకు తరలించడంతో ఎక్కడా ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. పెను తుపాను ప్రభా వంతో ప్రకాశం జిల్లా కందుకూరు డివిజన్‌లోని పలు మండ లాల్లో ఆదివారం మధ్యాహ్నం నుంచి భారీ వర్షంతో పాటు ఈదురు గాలులు ఉధృతమయ్యాయి. దీంతో జనజీవనం స్తంభించింది. ఆదివారం రాత్రికి తీరం దాటుతుండటంతో ప్రజలు బిక్కుబిక్కుమంటు కాలం గడుపు తున్నారు. గుంటూరు, పశ్చిమగోదావరిజిల్లా జల్‌ తుపాన్‌ ప్రభావం అతంతమాత్రమే కనిపించింది. సముద్రంలో అలజడి కొనసాగుతుంది. జల్‌ తుపాన్‌ ప్రభావం వివరాలు జిల్లాల వారీగా..

తెల్లారేదాకా నెల్లూరు జిల్లా ప్రజలకు తప్పని ముప్పు
JAALబంగాళాఖాతంలో ఏర్పడ్డ ‘జల్‌’ తుపాను సాధారణ తుపానుగా బలహీనపడినప్పటికీ తుపాను హెచ్చరికలు జిల్లా కు గత మూడు రోజులుగా రావడంతో అధికార యంత్రాంగం అన్ని ముందు జాగ్రత్త ఏర్పాట్లు చేసినప్పటికీ జిల్లాలో చలి గాలులు, విద్యుద్ఘాతాలు, చెట్లు విరిగిన సంఘటనల్లో జిల్లా వ్యాప్తంగా 15 మంది మృతిచెందారు. అయితే కేవలం ఏడు మంది మాత్రమే మరణించినట్లు అధికారులు చెబుతున్నారు. జిల్లావ్యాప్తంగా అన్ని చెరువులు నిండిపోయి ప్రమాదపుటంచు ల్లో ఉన్నాయి. జిల్లాలోని అతిపెద్ద చెరువైన కనిగిరి రిజర్వాయ ర్‌ పూర్తిస్థాయి మట్టాన్ని దాటి నిండిపోయి ఉంది. ముఖ్యంగా ఈ తీరప్రాంత మండలాలైన ఇందుకూరుపేట, అల్లూరు, తోటపల్లి గూడూరు, ముత్తుకూరు మండలాల్లో సముద్రపు నీరు తీరప్రాంత గ్రామాల్లోకి రావడంతో అధికారులు స్థాని కులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రాష్ట్రంలోనే అతి పెద్ద సముద్రతీరప్రాంతం కలిగిన నెల్లూరు జిల్లాలో ఈ తుపా ను అలజడి ఎక్కువగా ఉంది. సముద్రపు అలలు రెండు నుం చి 4 నాలుగు మీటర్ల ఎత్తు వరకూ ఎగిసిపడుతున్నాయి.

ముఖ్యంగా గూడూరు డివిజన్‌లోని తీరప్రాంత గ్రామాల్లోనూ, పులికాట్‌ సరస్సు సమీపంలోనూ సముద్రపు అలల తాకిడి ఎక్కువ గా ఉంది.ఇందుకూరుపేట, కోట, అల్లూరు, టీపీ గూడూరు మండ లాల పరిధిలోని తీరప్రాంత గ్రా మాల్లో సముద్రం 20 నుంచి 30 మీటర్ల వరకూ ముందుకు వచ్చిం ది. పులికాట్‌ సరస్సు సమీపం లోని జాలర్ల బోట్లు, వలలు దెబ్బ తిన్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది.ఆదివారం సాయంత్రం నుంచి జిల్లాలో జల్‌ తుపాను ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఆదివారం ఉదయం నుంచే జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు కురిసాయి. నెల్లూరు-చెనై్నల నడుమ తుపాను తీరం దాటనుందనే సమాచారంతో అధికారులు ఈ రెండు ప్రాంతాల నడుమ ఉన్న తుపాను ప్రభావిత గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించారు.

కృష్ణపట్నం ఓడరేవులో ఆదివారం ఉదయం 10నెంబరు అతిప్రమాద సూచికను ఎగరవేసిన అధికారులు సాయంత్రా నికి తీవ్రత తగ్గడంతో 7వ నెంబరు సూచికను ఎగరవేశారు. జిల్లావ్యాప్తంగా తీరప్రాంత, లోతట్టు ప్రాంతాలకు చెందిన 9,500 మందిని 34 పునరావాస కేంద్రాలకు తరలించి, వారికి భోజన, వసతి సౌకర్యాలను కల్పించారు. జిల్లా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి జిల్లా కేంద్రంలోనే ఉంటూ కాన్ఫెరెన్స్‌ ద్వారా అధికారులకు పలు సూచనలు, సలహాలు అందిస్తూ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. జిల్లాకు ప్రత్యేకాధికారిగా ప్రభు త్వం నియమించిన మార్క్‌ఫెడ్‌ ఎండీ చేరుకుని మంత్రి, జిల్లా కలెక్టర్‌, ఎస్పీలతో పాటు అధికారులతో సమీక్షించి పలు సూచనలు అందచేశారు. మరోవైపు పోలీస్‌ అధికారులు సముద్ర తీర ప్రాంతాల్లో పికెట్‌లు వేసి ప్రజల ఆస్తిపాస్తులకు రక్షణ చర్యలు చేపడుతున్నారు. కటక్‌ నుంచి జాతీయ విపత్తు రక్షణ దళం రెండు రోజులు ముందుగానే జిల్లాకు చేరుకొని సహాయక చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉంది. జిల్లాలోని 12 తీర ప్రాంత మండలాలకు జిల్లా కలెక్టర్‌ కె.రాంగోపాల్‌ ప్రత్యేకాధికారులను నియమించి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

తూర్పులో ఈదురు గాలులు - మోస్తరు వర్షం
jaalaబంగాళాఖాతంలో ఏర్పడ్డ జల్‌ తుపాను ప్రభావం తూర్పుకు ఉండకపోవచ్చని అధికార వర్గాలు అంటున్నా.. జిల్లా లో భయాందోళనలు నెలకొన్నాయి. ఆదివారం ఉదయం నుంచి జిల్లాలో అనేక ప్రాంతాల్లో ఈదురు గాలులతో పాటు ఓ మోస్త రు నుంచి భారీగానే వర్షాలు నమోదయ్యాయి. ఈశాన్య రుతు పవనాల ప్రభావంతో దెబ్బతిన్న ప్రాంతాల్లోనే తిరిగి తుపాను ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా సముద్రతీర ప్రాంతాల్లో ముసురు ప్రభావం ఉంది. వారం రోజుల పాటు నీటమునిగిన వరి చేలు జల్‌ తుపానుతో ఇబ్బందికరంగా మారాయి. కాకి నాడ పోర్టులో మూడవ నెంబర్‌ ప్రమాద హెచ్చరిక కొనసా గిస్తున్నారు. రేవులో ట్రాఫిక్‌ను సస్పెండ్‌ చేశారు. సముద్రం అల్లకల్లోలంగా ఉండటంతో మత్స్యకారులు వెళ్లకుం డా నిషేధా జ్ఞలు జారీ చేశారు. ఏ పాటి చిన్న తుపాను వచ్చిన ఉలిక్కిపడే ఉప్పాడ సముద్రం మరో పర్యాయం ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ ఉవ్వె త్తున రోడ్డుపైకి కెరటాలు చొచ్చుకొస్తున్నాయి.

ఈ వర్షాల వల్ల జిల్లాలోని 2లక్షల 50వేల ఎకరాల్లో పంట నష్టాలు జరిగినట్లు అధికారులు అంచనా వేశారు. లక్షా 75 వేల కుటుంబాలు ముంపు బాధితులుగా గుర్తించారు. వారికి సోమవారం నుంచి 20 కేజీల బియ్యం, 5 లీటర్ల కిరోసిన్‌ అందజేస్తారు. కోనసీమలో రెవెన్యూ యంత్రాంగం పునరావా స కేంద్రాలు ఏర్పాటుచేసిన దాఖలాలు లేవు.

కృష్ణా సముద్రంలో అలజడి
jaala1జల్‌ తుఫాను వార్తలు కృష్ణాజిల్లాలోని తీర ప్రాంత గ్రామా ల్లో అలజడి సృష్టించాయి. సహజంగా అమావాస్య, పౌర్ణమి లకు సముద్రంలో ఆటుపోట్లు అధికంగా ఉండటంతో పాటు భారీ వర్షాల కారణంగా సముద్రంలో కలిసే డ్రైన్లలోని నీరు ఎదురు తన్నటంతో తీర ప్రాంత గ్రామాల్లో అక్కడక్కడ సముద్రపు నీరు గ్రామాన్ని తాకింది. కృత్తివెన్ను మండలం మల్లంపూడి గ్రామ సమీపంలోని పెదలంక డ్రైన్‌ పొంగటంతో ఓర్లగొందితిప్ప గ్రామం జలమయమైంది. అయితే సముద్రపు ఆటుపోట్లతో ఆదివారం నీళ్ళు వెనక్కు వెళ్ళిపోయాయి. అలాగే ఉప్పుటేరు, లజ్జబండ డ్రైన్లు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షాల కారణంగా నీట మునిగిన వరి పొలాలు నేటికి నీరు లాగకపోవటంతో వరి కంకులు కుళ్ళి పోతున్నాయి. సముద్ర తీర ప్రాంత వాసులకు ఇది సహజమే అయినా జల్‌ తుఫాను వార్తలతో గత రెండ్రోజులుగా రెవిన్యూ శాఖ ఎప్పటికప్పుడు గ్రామస్థులను హెచ్చరిస్తూ పునరావాస కేంద్రాలకు ప్రజల తరలింపు కార్యక్రమాన్ని ప్రారంభించింది.

దివిసీమలో 1977 సం నవంబరులో సంభవించిన ఉప్పెన వలన 30 వేల మం ది ప్రజలు జలసమాధయ్యారు. ఈ నేపథ్యంలో జల్‌ తుఫాను ఏక్షణంలోనైనా జిల్లాను తాకుంతుదేమోనని ప్రజలు భయ భ్రాంతులవుతున్నారు. కృష్ణాజిల్లాలో నాగాయలంక, అవని గడ్డ, బందరు రూరల్‌, పెడన, బంటుమిల్లి, కృత్తివెన్ను మండ లాలలో ఎక్కువ శాతం తీరప్రాంత గ్రామాలు ఉండ టంతో ఇప్పటికే జిల్లా రెవిన్యూ యంత్రాంగం 8 పునరావాస కేంద్రాల ను ఏర్పాటుచేసి సుమారు 2 వేల మంది ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి భోజన వసతులు ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకూ జిల్లా అంతా వాతావరణం ప్రశాంతం గా ఉంది. ఎటువంటి వర్షం ఇంత వరకూ పడలేదు. అక్కడక్కడ చిన్నచిన్న చినుకులు మినహా పెద్దగా వర్షం నమోదు కాలేదు. తుఫాను పర్యవేక్షణకు ప్రత్యేక అధికారిగా గతంలో పనిచేసిన బి.ఆర్‌ మీనా ఆదివారం బందరు చేరుకున్నారు. కృత్తివెన్ను మండలం నిడమర్రు గ్రామ వాసి నడకుదిటి రామన్న చేపల వేటకు వెళ్ళి మృతిచెందాడు. ఓర్లగొందితిప్ప గ్రామంలో ఓ వృద్ధురాలు చలికి తట్టుకోలేక మృతిచెందింది. రాష్ట్ర పశుసం వర్థక శాఖా మంత్రి కొలుసు పార్థ సారధి ఉదయం నుంచి తీర ప్రాంత గ్రామాలైన కృత్తివెన్ను, లక్ష్మీపురం, బంటుమిల్లి ప్రాంతా ల్లో పునరావాస కేం ద్రాలను పరిశీలించారు.

తడిసి ముద్దైన చిత్తూరు
jaala2సముద్రతీరానికి సమీపంలో వున్న శ్రీకాళహస్తి, తొట్టంబేడు, బుచ్చినాయుడు కండ్రిగ, వరద య్యపాళ్యం, సత్యవేడు మండలాల్లో తుఫాన్‌ తాకిడి అధికంగా వుంది. నిరుపేదలు నిర్మించుకున్న పూరిగుడిసెలు తుఫాను గాలికి ఎగిరిపోయాయి. గూడు లేక పేదలు రోడ్డుపై నిలిచారు. ఐదు చెరువులకు గండ్లు పడ్డాయి. వీటిని పూడ్చడానికి అధికా రులు ప్రయత్నిస్తున్నారు. పీలేరు వద్ద కొత్తచెరువు ప్రమాద స్థాయికి చేరుకోవడంతో అధికారులు ముందస్తుగానే గండిని పూడ్చివేశారు. జిల్లాలోని శ్రీకాళహస్తి పరిధిలో లక్ష్మీపురం గిరిజన కాలనీ, చెంచులక్ష్మీ కాలని, ఈదలగుంట ప్రాంతాల్లో వాననీరు కాలనీల్లోకి చేరింది. దీంతో పేద గిరిజనులు సర్వం కోల్పోయి ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్నారు. కాళంగి, ఆరణియార్‌, కృష్టాపురం డ్యాంములు ప్రమాద స్థాయికి చేరుకున్నాయి. కాళంగిలో పది గేట్లను ఎత్తివేసి నీటి ఉధృతిని తగ్గించారు. జిల్లా కలెక్టర్‌ శేషాద్రి, ప్రత్యేక అధికారి రావత్‌లు తూర్పు మండలాల్లో పర్యటిస్తూ ఎప్పటికప్పుడు అవసరమైన సహాయక చర్యలను చేపట్టడానికి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తున్నారు. ఏకదాటిగా ఈదురగాలుతో కూడిన వర్షం కురుస్తుండడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారికంగా 136 ఇండ్లు నేలమట్టమయ్యాయి.

ఇందులో పాక్షికంగా కూడా కొన్ని ఇండ్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తిరుపతి ఆర్‌డిఒ కార్యాలయంలో తుఫాన్‌ ప్రభావంపై అధికారులతో చర్చించారు. దెబ్బతిన్న ఇండ్లకు ఆర్థికసాయం అందిస్తామని ప్రకటించారు. కాళహస్తి పరిధిలో మూడు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. తిరుపతిలో వర్షం కారణంగా విద్యుత్‌ వైర్లు తెగి నాగార్జున అనే విద్యార్థి మృతిచెందాడు. కరకంబాడి వద్ద 30 ఎకరాల అరటి తోట ధ్వంసం అయ్యింది. నేడు జిల్లాలో పాఠశాలలకు అధికారులు సెలవు ప్రకటించారు. జల్‌ తుపాన్‌ ప్రభావం జిల్లా అంతటా ఉన్నప్పటికీ తూర్పు మండలాల్లో అధికంగా ఉంది. రబిలో విత్తిన వరిపైరు పూర్తిగా నీట మునిగింది. తూర్పు మండలాల్లో ని పలు గిరిజన కాలనీలు జలమయమయ్యాయి.

‘జల్‌’దరించిన ఉత్తరాంధ్ర
jaala3కోస్తాంధ్ర ప్రజలను ఆందోళనకు గురిచేసిన జల్‌తుపాన్‌ ఉత్తరాంధ్రను కాస్త కనికరించింది. విశాఖ తుపాన్‌ కేంద్రం ముందస్తు హెచ్చరికలతో ప్రభుత్వ యంత్రాంగం పటిష్టమైన చర్యలు తీసుకోవడంలో సఫలీకృతం కావడంతో ఎక్కడా ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టాలు వాటిల్లలేదు. అయితే ఆదివారం నాడు కురిసిన కుండ పోత వర్షాలు, అలల ఉధృతి కారణంగా శ్రీకాకుళం జిల్లాలోని బారువ-కొత్తూరు తీర ప్రాంతంలో పది అడుగుల మేర సముద్రం ముందుకు చొచ్చుకుపోయింది. అయితే ఈమూడు జిల్లాల్లోని వాతావరణం సాధారణ స్థాయికి చేరుకోవడంతో అనేక ప్రాంతాల్లో మత్స్యకారులు సముద్రం లోకి చేపల వేటకు వెళ్లారు. ఇలా వెళ్లిన వారిలో విజయనగరం జిల్లా , భోగాపురం మండలం, చింతపల్లి ప్రాంతానికి చెందిన మత్స్యకారులు చేపలవేట ముగించుకుని తిరుగుప్రయాణంలో పడవ ఇంజన్‌ మరమ్మతులకు గురికా వడంతో సముద్రంలో చిక్కుకుపోయారు. కోస్ట్‌ గార్డు సిబ్బంది వారిని రక్షించి ఒడ్డుకు చేర్చడంతో వారు ప్రాణపాయం నుంచి గట్టెక్కారు.

nlrఅదే విధం గా శ్రీకాకుళం జిల్లా బారువా-కొత్తూరు ప్రాంతానికి చెందిన మరో మత్స్యకారుడు బోటు పై నుంచి పడిన సంఘటన మిన హాయించి ఎలాంటి ప్రభావం కనిపించలేదని ఆ జిల్లా రెవి న్యూ అధికారులు తెలిపారు. ఈ తుపాన్‌ ప్రభావం మరో రెండు రోజులు కొనసాగే అవకాశాలు వున్న దృష్య్టా రణస్థలం, కంచి లి, టెక్కలి, పాతపట్నం తదితర ప్రాంతాల్లో సహాయక కేంద్రా లను ఏర్పాటు చేశారు. రాష్ట్ర రెవెన్యూ శాఖా మంత్రి ధర్మాన ప్రసాదరావు జిల్లాలోని సహాయక చర్యలపై నిత్యం అధికారు లతో ఫోన్‌ ద్వారా సమీక్షిస్తున్నారు. అదే విధం గా విజయన గరం జిల్లాకు చెందిన మంత్రి బొత్సా కూడా అదే స్థాయిలో జిల్లా పరిస్థితిని ఎప్పటికప్పుడు అధికారులతో కలిసి సమీక్షిస్తు న్నారు. ఇక విశాఖజిల్లాలో జల్‌ తుపాన్‌ కార ణంగా పాయక రావుపేట మండలం, బంగారమ్మపేట వద్ద సముద్రపు అలలు పది అడుగుల మేర చొచ్చుకు వచ్చింది. దీంతో సమీప ప్రాంతాల ప్రజలను స్థానిక ఎమ్మెల్యే ఆదేశా లతో సురక్షిత ప్రాంతాలకు చేర్చారు. అదే విధంగా పూడిమడక ప్రాంతానికి చెందిన మత్స్యకారులు ఐదుగురు సముద్రంలో చేపల వేటకు వెళ్లగా, వారు ఆదివారం తిరుగుముఖం పట్టిన నేపథ్యంలో వారు ప్రయా ణించే బోటు బోల్తా పడింది.

అయితే బోటులో వున్న ఒక మత్స్యకారుడు మాత్రం మృత్యువాత పడ్డాడు. మిగిలిన వారు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. నగరం లోని ఆదివారం ఉదయం నుంచి కురుస్తున్న కుండపోత వర్షా నికి నగరంలోని ఒక వస్త్ర దుకాణం పూర్తిగా నేలకొరి గింది. అయితే ఆదివారం సెలవు దినం కావడంతో ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లలేదు. అదే విధంగా కంచరపాలెం, గాజు వాక ,పారిశ్రామిక ప్రాంతాల్లోని కొండ వాలు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను ముందస్తు చర్యల్లో భాగంగా సురక్షిత ప్రాంతాలకు చేర్చారు. అయితే మరో రెండు రోజులు ఇదే స్థాయిలో వర్షాలు కురిసే అవకాశాలు వున్న దృష్య్ట వారిని ప్రత్యేక శిబిరాల్లో వుండే విధంగా చర్యలు తీసుకుంటున్నారు.

‘ప్రకాశం’ బిక్కుబిక్కు
busఆగ్నేయ బంగాళఖాతంలో ఏర్పడిన పెను తుపాను ప్రభావంతో ప్రకాశం జిల్లా కందుకూరు డివిజన్‌లోని పలు మండలాల్లో ఆదివారం మధ్యాహ్నం నుంచి భారీ వర్షంతో పాటు ఈదురు గాలులు ఉధృతమయ్యాయి. దీంతో జనజీవనం స్తంభించింది. 3000 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు .ఆదివారం రాత్రికి తీరం దాటుతుం డటంతో ప్రజలు బిక్కుబిక్కుమంటు కాలం గడుపుతున్నారు. ఇప్పటికే పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేక అధికారి కరికాల వళవన్‌తో పాటు జిల్లా కలెక్టర్‌ కాంతీలాల్‌ దండే, ఎస్పీ నరసింహ రాజు అధికారులను అప్రమత్తం చేశారు. జిల్లాలో 75 లోతట్టు ప్రాంతాలను గుర్తించి ఎటువంటి విపత్కర పరిస్థితిలోనైనా నష్టాన్ని నివారించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. ఆదివారం రాళ్లపాడు ప్రాజెక్టు అధికారులు మూడు గేట్లు ఎత్తి 1500 క్యూసెక్కుల వరద నీరు మన్నెరులోకి విడుదల చేశారు.

ఉదయం ఏడు గంటల సమయంలో ప్రాజెక్టులో నీటి మట్టం 18.8 అడుగులు చేరుకుంది. సాయంత్రం 5 గంటల నుంచి సింగరాయకొండ, కందుకూరు, ఉలవపాడు, లింగసముద్రం, గుడ్లూరు మండలాల్లో భారీ వర్షంతో పాటు చలితో కూడిన ఈదురు గాలులు బలంగా వీశాయి. తీరం వెంబడి సముద్రం ఒడ్డు సుమారు ఏడు మీటర్లు కోతకు గురికాక, మరికొన్ని చోట్ల 30 నుంచి 50 మీటర్ల మేర ముందుకు వచ్చింది.

Tuesday, November 2, 2010

రాష్ట్రానికి సూపర్ సైక్లోన్ గండం! * పొంచివున్న సూపర్ సైక్లోన్?

వాతావరణ నిపుణుల అనుమానం.. ముందే అప్రమత్తం కావాలని సూచన
అండమాన్ నికోబార్ దీవులకు సమీపంలో వాయుగుండం
బంగాళాఖాతంలో బలంగా ఉన్న వాయుగుండం సూపర్ సైక్లోన్‌గా మారే అవకాశం
రెండు, మూడ్రోజుల్లో రాష్ట్రం వైపు... కోస్తాంధ్రపై పెను ప్రభావం
దీపావళి నాటికి ప్రతాపం చూపే ప్రమాదం... ఇదే జరిగితే భారీగా నష్టం
1977లో దివిసీమ ఉప్పెనకు సూపర్ సైక్లోనే కారణం

అండమాన్ నికోబార్ దీవులకు సమీపంలో వాయుగుండం
రెండు, మూడ్రోజుల్లో రాష్ట్రం వైపు వచ్చే అవకాశం
 
రాష్ట్రానికి తుపాను రూపంలో పెనుగండం పొంచి ఉందా..? ఇప్పటికే ఈశాన్య రుతుపవనాలు, అల్పపీడనంతో అతలాకుతలమవుతున్న రాష్ట్రానికి మరో ముప్పు ముంచుకొస్తోందా..? దివిసీమను వణికించిన భయంకర పరిస్థితులు కోస్తాంధ్రలో మళ్లీ పునరావృతం కానున్నాయా..? ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే ఈ ప్రమాదాన్ని కొట్టిపారేయలేమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. రాష్ట్రానికి ‘సూపర్ సైక్లోన్’ ముప్పు ఉందని పేర్కొంటున్నారు. గల్ఫ్ ఆఫ్ థాయ్‌లాండ్ వద్ద అండమాన్ నికోబార్ దీవులకు సమీపంలో ఏర్పడ్డ వాయుగుండం తీరుతెన్నులను బట్టి వీరు ఈ అంచనాకు వస్తున్నారు. ప్రస్తుతం ఈ వాయుగుండం ముందుకు కదిలి దక్షిణ అండమాన్ సముద్రంలో ఉన్న అల్పపీడనంలో విలీనమైంది. రానున్న 24 గంటల్లో వాయుగుండంగా మారనుంది. ఈ పెను తుఫాన్‌కు ‘జల’ అని నామకరణం చేయనున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ తుఫానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ప్రకటించింది. తుఫాను మనరాష్ట్రం వైపు రావడానికి మరో రెండు, మూడు రోజుల సమయం పట్టనుంది. అంటే దీపావళి (ఈ నెల 5) నాటికి ప్రతాపం చూపడం ఆరంభిస్తుందన్నమాట! ప్రస్తుతం ఇది బంగాళాఖాతంలో బలంగా ఉంది. దీని కదలికను బట్టి తూర్పుగోదావరి, కృష్ణా, నెల్లూరు జిల్లాల వైపు దూసుకొచ్చే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం వాయుగుండం పరిస్థితిని అంచనా వేస్తున్న వాతావరణ శాస్తవ్రేత్తలు ఇది ‘సూపర్ సైక్లోన్’గా మారే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. అదే జరిగితే 1999 నవంబర్‌లో ఒరిస్సాలో సంభ వించిన పరిస్థితులు తలెత్తవచ్చని భావిస్తున్నారు. 1999 అక్టోబర్ 25న ఏర్పడ్డ వాయుగుండం తీవ్ర తుఫానుగా, అనంతరం సూపర్‌సైక్లోన్‌గా బలపడి నవంబర్ మూడో తేదీ వరకూ ప్రతాపం చూపింది. గంటకు 260 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు, కుండపోత వర్షాలు కురిశాయి. ఈ బీభత్సానికి ఒరిస్సాలో 15 వేల మంది దుర్మరణం పాలయ్యారు. 1977 నవంబర్‌లో దివిసీమ ఉప్పెనకు కూడా సూపర్ సైక్లోనే కారణం. అయితే ప్రస్తుతం అంతటి తీవ్రత దీనికి లేకున్నా రానున్న ప్రమాదాన్ని తక్కువగా చూడలేమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

సాధారణంగా ఎలాంటి ప్రభావం చూపని అల్పపీడనద్రోణి, ఉపరితల ఆవర్తనాలతోనే ఈశాన్య రుతుపవనాలు రెచ్చిపోయి కుంభవృష్టి వర్షాలతో రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. అలాంటిది రుతుపవనాలు మునుపెన్నడూ లేనంత బలంగా ఉన్న తరుణంలో వచ్చే పెను తుపానుతో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని హెచ్చరిస్తున్నారు. తుపాను ప్రభావంతో పలుచోట్ల 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. దీనికి గంటకు 80 కిలోమీటర్లకు పైగా వేగంతో పెనుగాలులు తోడుకానున్నాయి. మరోవైపు ఈ పెనుతుపాను వారం రోజుల్లో తమిళనాడుకు ఉత్తరంగా, ఆంధ్రప్రదేశ్ దక్షిణ తీర ప్రాంతాన్ని తాకుతుందని స్కైమెట్ అంచనా వేస్తోంది. ఇప్పటికే కురుస్తున్న భారీ వర్షాలకు రాష్ట్రంలో అనేకచోట్ల రిజర్వాయర్లు, చెరువులు పూర్తిగా నిండిపోయాయి. పలుచోట్ల వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఇప్పుడు కొద్దిపాటి భారీ వర్షాన్ని కూడా భరించే స్థితిలో ఇవి లేవు. ముందున్న ముప్పును అంచనా వేసిన ప్రభుత్వం కూడా ముందు జాగ్రత్త చర్యగా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. ఇప్పటికే ఆయా జిల్లాల్లో ఏర్పాటు చేసిన కంట్రోల్‌రూమ్‌లను ఈ నెల 9 వరకూ కొనసాగించాలని ఆదేశించింది. తుపాను ప్రభావం చూపడానికి ఇంకా రెండు, మూడు రోజుల సమయం ఉండటంతో పూటుగా నిండిన చెరువులు, కరకట్టల గట్టులను యుద్ధ ప్రాతిపదికన పటిష్టం చేయాల్సిన అవసరాన్ని నిపుణులు గుర్తుచేస్తున్నారు. తాగునీటిని, మందులను నిల్వ చేయాలని ఆంధ్రా వర్సిటీ వాతావరణం, సముద్ర అధ్యయన విభాగపు గౌరవ ప్రొఫెసర్ ఒ.ఎస్.ఆర్.యు.భానుకుమార్ సూచించారు.

సూపర్ సైక్లోన్ అంటే..?
వాతావరణంలో అల్పపీడన ద్రోణి నుంచి సూపర్ సైక్లోన్ ప్రస్థానం మొదలవుతుంది. ద్రోణి బలపడి అల్పపీడనంగా మారుతుంది. అది వాయుగుండంగాను, తీవ్ర వాయుగుండంగానూ రూపాంత రం చెందాక తుఫాను అవుతుంది. ఇది బలపడితే తీవ్ర తుఫాను, మరింత తీవ్రమైతే సూపర్ సైక్లోన్‌గా మారుతుంది. అల్పపీడనంగా ఉన్నప్పుడు గాలుల వేగం గంటకు 30 కిలోమీటర్ల లోపు, వాయుగుండంగా మారితే 30-49 కిలోమీటర్లు, తీవ్రవాయుగుండానికి 50-61, తుఫానుకు 62-87, తీవ్ర తుఫానుకు 88- 117, అతి తీవ్ర తుపానుకు 118-220, సూపర్ సైక్లోన్‌కు 222 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. ఆ సమయంలో పక్కా ఇళ్లు, భారీ వృక్షాలు కూడా నేలమట్టమవుతాయి. 20 సెం.మీలకు పైగానే వర్షపాతం నమోదవుతుంది. సూపర్ సైక్లోన్ సమయంలో సముద్రంలో అలల ఉధృతి 14 మీటర్లకు పైనే ఉంటుంది.