అడ్వర్టైజ్మెంట్ ఏం చేయాలి..? కంపెనీ బ్రాండ్ను పెంచాలి. ఉత్పత్తులు వేగంగా అమ్ముడుపోయేలా చేయాలి. ఈ రెండు పనులు చేయలేదంటే ఆ అడ్వర్టైజ్మెంట్ ఫెయిల్ అయినట్లే కదా. ఇప్పుడు జరుగుతున్నది అదే. ప్రస్తుతం వస్తున్న ప్రకటనల్లో 85 శాతం ఫలితాలను ఇవ్వడం లేదు. కంపెనీలు కోట్లు కుమ్మరించి తీస్తున్న ప్రకటనలు వృథా అవుతున్నాయి. ఈ రంగాన్ని ఆషామాషీగా తీసుకుని పనిచేస్తున్న వాళ్లు ఎక్కువవ్వడంతోనే ఈ సమస్యలు వస్తున్నాయి. బ్యాంకింగ్, ఫార్మా, ఇన్స్యూరెన్స్ కంపెనీలలాగే అడ్వర్టైజింగ్ రంగం కూడా అంతటి సీరియస్ వృత్తి. ఇందులో పనిచేసేవాళ్లు తాము అందరికంటే సృజనాత్మకశీలురమని భ్రమిస్తుంటారు. ప్రజల అభిరుచులు ఎలా మారిపోతున్నాయి..? ఏం కోరుకుంటున్నారు..? ఎవరి కొనుగోలు శక్తి ఎంత..? అనే విషయాలే పట్టడం లేదు ప్రకటనల రూపకర్తలకు.వాగ్దానం+నాణ్యత
ఒక్కోసారి కొన్ని అడ్వర్టైజ్మెంట్లు అసలుకే మోసం తెస్తాయి. కోకాకోలా కంపెనీ ఉత్పత్తిలో అదే జరిగింది. కోక్నే కొంచెం మార్చి 'న్యూ కోక్' అనే కొత్తరకం పానీయాన్ని మార్కెట్లోకి తీసుకొచ్చారు. కోట్లు ఖర్చుపెట్టి ప్రకటనలు గుప్పించారు. అయినా సరే, ఆ ఉత్పత్తి ఘోరంగా విఫలమైంది. మళ్లీ పాత కోక్నే ఉత్పత్తి చేయక తప్పలేదు. ప్రకటనలలో ఇచ్చే వాగ్దానానికి, నాణ్యతకు పొంతన కుదరకపోతే ఇలాంటి ఫలితాలే వస్తాయి. మన దేశంలో ప్రకటనల రంగం విలువ రూ.22 వేల కోట్లు.
దీనిలో ఎలక్ట్రానిక్ మీడియా వాటా 55 శాతంకాగా ప్రింట్ మీడియా 40 శాతం ఔట్డోర్ 3, రేడియో, ఇంటర్నెట్ కలిపి ఒక శాతం ఉంది. భవిష్యత్తులో మొబైల్ ప్రకటనలు కూడా పెరిగే అవకాశం ఉంది. మహారాష్ట్ర, ముంబయి, ఢిల్లీ, చెన్నైలలో ఈ రంగం ఎందుకు దూసుకెళుతోందంటే.. అక్కడ ఉత్పత్తిదారులు ఎక్కువమంది ఉన్నారు. మన రాష్ట్రంలో సేవలు మినహా, ఉత్పత్తి తక్కువ. అందుకే మన దగ్గర ప్రకటనల రంగం అభివృద్ధి కావడం లేదు. అయితే గ్రామాలు, ఓ మోస్తరు పట్టణాల్లో కూడా వస్తువినియోగం వేగవంతమవుతోంది. వినియోగదారుని మనస్తత్వం కూడా మారిపోతోంది.
కాని దీనికి తగ్గట్టు అడ్వర్టైజ్మెంట్లు మారడం లేదు. విమల్, రస్నా, నిర్మా కంపెనీల ప్రకటనలు గుర్తుండిపోయినట్లు.. ఇప్పుడొస్తున్న ప్రకటనలు గుర్తుండటం లేదు. బ్రాండ్ అస్తిత్వాన్ని నిలబెట్టే ప్రకటనలు కూడా రావడం లేదు. ప్రజలను సమ్మోహితులను చేసి.. వినియోగదారులుగా మార్చగలిగే శక్తి కొన్ని ప్రకటనలకే ఉంది. నిజానికి ఇప్పుడు అన్ని ఉత్పత్తులలో నాణ్యత పెరిగింది. దానికి తోడు పోటీ ఎక్కువైంది. ఇలాంటి సమయంలో ప్రకటనలే కీలకపాత్ర పోషిస్తాయి. వినియోగదారుని మనసులోకి పరకాయప్రవేశం చేస్తేనే ప్రభావశీలమైన ప్రకటనలను తయారుచేయగలరు.ఈ పుస్తకంలో..
మన దేశంలో ప్రకటనల రంగం అభివృద్ధి చెందిన దేశాలతో పోటీపడలేకపోవడానికి ఎన్నో కారణాలున్నాయి. అందులో ఒకటి అనుభవజ్ఞుల పుస్తకాలు లేకపోవడం. ఈ కొరతను తీర్చేందుకే 'లర్నింగ్స్ ఆఫ్ యాన్ అడ్వర్టైజింగ్ ప్రాక్టీషనర్' పుస్తకం రాశాను. ఈ రంగంలో నాకున్న 30 ఏళ్ల అనుభవాలను ఈ పుస్తకంలో విశ్లేషించాను. కంపెనీ బ్రాండ్లకు ఎలా పేరు తేవాలి? వినియోగదారులు ఏం కోరుకుంటున్నారు? ఉత్పత్తులను ఎంతవరకు ప్రజెంట్ చేయవచ్చు? ప్రకటనలరూపకర్తల ఆలోచనలకు ఎలాంటి హద్దులుండాలి? అనే విషయాలతోపాటు సుమారు ప్రకటనలరంగం మీద 20 అధ్యాయాలుగా విశ్లేషణలున్నాయి. ఈ పుస్తకం శనివారం హైదరాబాద్లోని క్రాస్వర్డ్ బుక్స్టోర్లో ఆవిష్కరించనున్నాం.
జూ ఆది మల్లెంపూటి



బంగాళాఖాతంలో ఏర్పడ్డ ‘జల్’ తుపాను సాధారణ తుపానుగా బలహీనపడినప్పటికీ తుపాను హెచ్చరికలు జిల్లా కు గత మూడు రోజులుగా రావడంతో అధికార యంత్రాంగం అన్ని ముందు జాగ్రత్త ఏర్పాట్లు చేసినప్పటికీ జిల్లాలో చలి గాలులు, విద్యుద్ఘాతాలు, చెట్లు విరిగిన సంఘటనల్లో జిల్లా వ్యాప్తంగా 15 మంది మృతిచెందారు. అయితే కేవలం ఏడు మంది మాత్రమే మరణించినట్లు అధికారులు చెబుతున్నారు. జిల్లావ్యాప్తంగా అన్ని చెరువులు నిండిపోయి ప్రమాదపుటంచు ల్లో ఉన్నాయి. జిల్లాలోని అతిపెద్ద చెరువైన కనిగిరి రిజర్వాయ ర్ పూర్తిస్థాయి మట్టాన్ని దాటి నిండిపోయి ఉంది. ముఖ్యంగా ఈ తీరప్రాంత మండలాలైన ఇందుకూరుపేట, అల్లూరు, తోటపల్లి గూడూరు, ముత్తుకూరు మండలాల్లో సముద్రపు నీరు తీరప్రాంత గ్రామాల్లోకి రావడంతో అధికారులు స్థాని కులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రాష్ట్రంలోనే అతి పెద్ద సముద్రతీరప్రాంతం కలిగిన నెల్లూరు జిల్లాలో ఈ తుపా ను అలజడి ఎక్కువగా ఉంది. సముద్రపు అలలు రెండు నుం చి 4 నాలుగు మీటర్ల ఎత్తు వరకూ ఎగిసిపడుతున్నాయి.
బంగాళాఖాతంలో ఏర్పడ్డ జల్ తుపాను ప్రభావం తూర్పుకు ఉండకపోవచ్చని అధికార వర్గాలు అంటున్నా.. జిల్లా లో భయాందోళనలు నెలకొన్నాయి. ఆదివారం ఉదయం నుంచి జిల్లాలో అనేక ప్రాంతాల్లో ఈదురు గాలులతో పాటు ఓ మోస్త రు నుంచి భారీగానే వర్షాలు నమోదయ్యాయి. ఈశాన్య రుతు పవనాల ప్రభావంతో దెబ్బతిన్న ప్రాంతాల్లోనే తిరిగి తుపాను ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా సముద్రతీర ప్రాంతాల్లో ముసురు ప్రభావం ఉంది. వారం రోజుల పాటు నీటమునిగిన వరి చేలు జల్ తుపానుతో ఇబ్బందికరంగా మారాయి. కాకి నాడ పోర్టులో మూడవ నెంబర్ ప్రమాద హెచ్చరిక కొనసా గిస్తున్నారు. రేవులో ట్రాఫిక్ను సస్పెండ్ చేశారు. సముద్రం అల్లకల్లోలంగా ఉండటంతో మత్స్యకారులు వెళ్లకుం డా నిషేధా జ్ఞలు జారీ చేశారు. ఏ పాటి చిన్న తుపాను వచ్చిన ఉలిక్కిపడే ఉప్పాడ సముద్రం మరో పర్యాయం ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ ఉవ్వె త్తున రోడ్డుపైకి కెరటాలు చొచ్చుకొస్తున్నాయి.
జల్ తుఫాను వార్తలు కృష్ణాజిల్లాలోని తీర ప్రాంత గ్రామా ల్లో అలజడి సృష్టించాయి. సహజంగా అమావాస్య, పౌర్ణమి లకు సముద్రంలో ఆటుపోట్లు అధికంగా ఉండటంతో పాటు భారీ వర్షాల కారణంగా సముద్రంలో కలిసే డ్రైన్లలోని నీరు ఎదురు తన్నటంతో తీర ప్రాంత గ్రామాల్లో అక్కడక్కడ సముద్రపు నీరు గ్రామాన్ని తాకింది. కృత్తివెన్ను మండలం మల్లంపూడి గ్రామ సమీపంలోని పెదలంక డ్రైన్ పొంగటంతో ఓర్లగొందితిప్ప గ్రామం జలమయమైంది. అయితే సముద్రపు ఆటుపోట్లతో ఆదివారం నీళ్ళు వెనక్కు వెళ్ళిపోయాయి. అలాగే ఉప్పుటేరు, లజ్జబండ డ్రైన్లు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షాల కారణంగా నీట మునిగిన వరి పొలాలు నేటికి నీరు లాగకపోవటంతో వరి కంకులు కుళ్ళి పోతున్నాయి. సముద్ర తీర ప్రాంత వాసులకు ఇది సహజమే అయినా జల్ తుఫాను వార్తలతో గత రెండ్రోజులుగా రెవిన్యూ శాఖ ఎప్పటికప్పుడు గ్రామస్థులను హెచ్చరిస్తూ పునరావాస కేంద్రాలకు ప్రజల తరలింపు కార్యక్రమాన్ని ప్రారంభించింది.
సముద్రతీరానికి సమీపంలో వున్న శ్రీకాళహస్తి, తొట్టంబేడు, బుచ్చినాయుడు కండ్రిగ, వరద య్యపాళ్యం, సత్యవేడు మండలాల్లో తుఫాన్ తాకిడి అధికంగా వుంది. నిరుపేదలు నిర్మించుకున్న పూరిగుడిసెలు తుఫాను గాలికి ఎగిరిపోయాయి. గూడు లేక పేదలు రోడ్డుపై నిలిచారు. ఐదు చెరువులకు గండ్లు పడ్డాయి. వీటిని పూడ్చడానికి అధికా రులు ప్రయత్నిస్తున్నారు. పీలేరు వద్ద కొత్తచెరువు ప్రమాద స్థాయికి చేరుకోవడంతో అధికారులు ముందస్తుగానే గండిని పూడ్చివేశారు. జిల్లాలోని శ్రీకాళహస్తి పరిధిలో లక్ష్మీపురం గిరిజన కాలనీ, చెంచులక్ష్మీ కాలని, ఈదలగుంట ప్రాంతాల్లో వాననీరు కాలనీల్లోకి చేరింది. దీంతో పేద గిరిజనులు సర్వం కోల్పోయి ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్నారు. కాళంగి, ఆరణియార్, కృష్టాపురం డ్యాంములు ప్రమాద స్థాయికి చేరుకున్నాయి. కాళంగిలో పది గేట్లను ఎత్తివేసి నీటి ఉధృతిని తగ్గించారు. జిల్లా కలెక్టర్ శేషాద్రి, ప్రత్యేక అధికారి రావత్లు తూర్పు మండలాల్లో పర్యటిస్తూ ఎప్పటికప్పుడు అవసరమైన సహాయక చర్యలను చేపట్టడానికి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తున్నారు. ఏకదాటిగా ఈదురగాలుతో కూడిన వర్షం కురుస్తుండడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారికంగా 136 ఇండ్లు నేలమట్టమయ్యాయి.
కోస్తాంధ్ర ప్రజలను ఆందోళనకు గురిచేసిన జల్తుపాన్ ఉత్తరాంధ్రను కాస్త కనికరించింది. విశాఖ తుపాన్ కేంద్రం ముందస్తు హెచ్చరికలతో ప్రభుత్వ యంత్రాంగం పటిష్టమైన చర్యలు తీసుకోవడంలో సఫలీకృతం కావడంతో ఎక్కడా ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టాలు వాటిల్లలేదు. అయితే ఆదివారం నాడు కురిసిన కుండ పోత వర్షాలు, అలల ఉధృతి కారణంగా శ్రీకాకుళం జిల్లాలోని బారువ-కొత్తూరు తీర ప్రాంతంలో పది అడుగుల మేర సముద్రం ముందుకు చొచ్చుకుపోయింది. అయితే ఈమూడు జిల్లాల్లోని వాతావరణం సాధారణ స్థాయికి చేరుకోవడంతో అనేక ప్రాంతాల్లో మత్స్యకారులు సముద్రం లోకి చేపల వేటకు వెళ్లారు. ఇలా వెళ్లిన వారిలో విజయనగరం జిల్లా , భోగాపురం మండలం, చింతపల్లి ప్రాంతానికి చెందిన మత్స్యకారులు చేపలవేట ముగించుకుని తిరుగుప్రయాణంలో పడవ ఇంజన్ మరమ్మతులకు గురికా వడంతో సముద్రంలో చిక్కుకుపోయారు. కోస్ట్ గార్డు సిబ్బంది వారిని రక్షించి ఒడ్డుకు చేర్చడంతో వారు ప్రాణపాయం నుంచి గట్టెక్కారు.
అదే విధం గా శ్రీకాకుళం జిల్లా బారువా-కొత్తూరు ప్రాంతానికి చెందిన మరో మత్స్యకారుడు బోటు పై నుంచి పడిన సంఘటన మిన హాయించి ఎలాంటి ప్రభావం కనిపించలేదని ఆ జిల్లా రెవి న్యూ అధికారులు తెలిపారు. ఈ తుపాన్ ప్రభావం మరో రెండు రోజులు కొనసాగే అవకాశాలు వున్న దృష్య్టా రణస్థలం, కంచి లి, టెక్కలి, పాతపట్నం తదితర ప్రాంతాల్లో సహాయక కేంద్రా లను ఏర్పాటు చేశారు. రాష్ట్ర రెవెన్యూ శాఖా మంత్రి ధర్మాన ప్రసాదరావు జిల్లాలోని సహాయక చర్యలపై నిత్యం అధికారు లతో ఫోన్ ద్వారా సమీక్షిస్తున్నారు. అదే విధం గా విజయన గరం జిల్లాకు చెందిన మంత్రి బొత్సా కూడా అదే స్థాయిలో జిల్లా పరిస్థితిని ఎప్పటికప్పుడు అధికారులతో కలిసి సమీక్షిస్తు న్నారు. ఇక విశాఖజిల్లాలో జల్ తుపాన్ కార ణంగా పాయక రావుపేట మండలం, బంగారమ్మపేట వద్ద సముద్రపు అలలు పది అడుగుల మేర చొచ్చుకు వచ్చింది. దీంతో సమీప ప్రాంతాల ప్రజలను స్థానిక ఎమ్మెల్యే ఆదేశా లతో సురక్షిత ప్రాంతాలకు చేర్చారు. అదే విధంగా పూడిమడక ప్రాంతానికి చెందిన మత్స్యకారులు ఐదుగురు సముద్రంలో చేపల వేటకు వెళ్లగా, వారు ఆదివారం తిరుగుముఖం పట్టిన నేపథ్యంలో వారు ప్రయా ణించే బోటు బోల్తా పడింది.
ఆగ్నేయ బంగాళఖాతంలో ఏర్పడిన పెను తుపాను ప్రభావంతో ప్రకాశం జిల్లా కందుకూరు డివిజన్లోని పలు మండలాల్లో ఆదివారం మధ్యాహ్నం నుంచి భారీ వర్షంతో పాటు ఈదురు గాలులు ఉధృతమయ్యాయి. దీంతో జనజీవనం స్తంభించింది. 3000 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు .ఆదివారం రాత్రికి తీరం దాటుతుం డటంతో ప్రజలు బిక్కుబిక్కుమంటు కాలం గడుపుతున్నారు. ఇప్పటికే పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేక అధికారి కరికాల వళవన్తో పాటు జిల్లా కలెక్టర్ కాంతీలాల్ దండే, ఎస్పీ నరసింహ రాజు అధికారులను అప్రమత్తం చేశారు. జిల్లాలో 75 లోతట్టు ప్రాంతాలను గుర్తించి ఎటువంటి విపత్కర పరిస్థితిలోనైనా నష్టాన్ని నివారించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. ఆదివారం రాళ్లపాడు ప్రాజెక్టు అధికారులు మూడు గేట్లు ఎత్తి 1500 క్యూసెక్కుల వరద నీరు మన్నెరులోకి విడుదల చేశారు. 






కామన్వెల్త్ క్రీడలను పురస్కరించుకుని ఢిల్లీలో నిర్వహించిన ‘కామన్వెల్త్ ఆన్ వీల్’ పోటీల్లో విస్మయానికి గురిచేసిన అంగవికలుల భరతనాట్య ప్రదర్శన.
పెద్ద ఆవు పక్కన నిలబడిన ఈ చిన్న ఆవు పేరు స్వాలో. ఇది ఎంత చిన్న ఆవు అంటే గొర్రెకంటే తక్కువ ఎత్తులో ఉంటుంది. ఎత్తు కేవలం 33.5 అంగుళాలు (0.8 మీటర్). పదకొండేళ్ల ఈ ఆవు ఇప్పటికే తొమ్మిది దూడలకు జన్మనిచ్చింది. తాజాగా అతిచిన్న ఆవుగా గిన్నిస్ రికార్డును సొంతం చేసుకుంది. చాలా విషయాలు గిన్నిస్ బుక్లోకి ఎక్కుతుంటాయి. అయితే, ఈ ఆవు మాత్రం గిన్నిస్ బుక్ ఎడిటర్ క్రెయిగ్ గ్లెండే మనసు దోచింది. తాజాగా నమోదైన మూడువేల గిన్నిస్ రికార్డుల్లో క్రెయిగ్ను ఈ విషయం బాగా ఆకట్టుకుందని బీబీసీ పేర్కొంది.
విచిత్ర వేషధారణలో పొడవైన బూరలు ఊదుతూ కొనసాగుతున్న ఈ ఊరేగింపు మెక్సికోలోది. మెక్సికన్ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ వేడుక జరిగింది. ఇది మెక్సికన్లకు 200వ స్వాతంత్య్ర దినోత్సవం కావడం విశేషం. 1810 సంవత్సరానికి ముందు స్పెయిన్ పాలనలో ఉన్న మెక్సికన్లు సుమారు పదేళ్లు పోరాడి స్వాతంత్య్రం సాధించుకున్నారు.
సమస్య చూసే కోణాన్ని బట్టి పరిష్కారం ఉంటుంది. ఈ చిత్రం బంగ్లాదేశ్ రాజధాని ఢాకా సమీపంలోని బురిగంగా నదిపై తీసినది. నదిని దాటడానికి బ్రిడ్జి లేకపోవడంతో అక్కడ పడవలు వాడేవారు. అయితే, గురప్రు డెక్క విపరీతంగా పెరిగిపోయి పడవ ప్రయాణానికి తీవ్ర ఆటంకం ఏర్పడింది. దీంతో స్థానికులు ఇలా పడవలన్నింటినీ ఒకదానిపక్కన ఒకటి వేసి వంతెనలాగా తయారుచేసుకున్నారు. ఆలోచించాలే గాని పరిష్కారాలకు ఏం కొదవ చెప్పండి!
(సంచలనాలకు, వివాదాలకు కేరాఫ్ అడ్రస్
కావలసిన పదార్థాలు


